మొత్తం పేజీ వీక్షణలు

1, ఆగస్టు 2013, గురువారం

ఇది రాష్ట్రం ముక్కలయ్యిందని బాధపడాల్సిన తరుణమా?

తెలంగాణా నిర్ణయం జరిగిపోయింది. తెలంగాణేతర ప్రాంతంలో పరిస్థితులు ఇపుడు అట్టుడుకుతున్నాయి. అయితే ఈ ఆందోళనలు అరణ్య రోదనలే అవుతాయి తప్ప వాటివల్ల ఉపయోగం ఉండదు. తమ పార్టీ నేతలు చెప్తేనే వినని అధినేత్రికి ఈ ఆందోళనలు ఒక లెక్కా? కానే కాదు. అందుచేత ఇపుడు భావావేశాలని ప్రదర్శించి తరువాత చల్లబడిపోవటం కన్నా, ఎన్నికలవరకూ ఈ ఆవేశాన్ని మనసులోనే ఉంచుకుని
వోటు ద్వారా మన దెబ్బ ఏమిటో స్వార్థ రాజకీయ నాయకులకు రుచి చూపిస్తే బావుంటుంది.

చరిత్రనుంచి పాఠాలు నేర్చుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతాం కనుక ఈ సంఘటన కు సంబంధించిన కొన్ని విషయాలను గమనిద్దాం.
(1) ప్రత్యేక రాష్ట్రం కొరకు జరిగినంత ఘాటుగా సమైక్య ఉద్యమాలు జరగలేదు. దాని అర్థం సీమాంధ్రులు సమైక్య రాష్ట్రాన్ని బలంగా కోరుకోవట్లేదని తెలంగాణా నాయకులు బాగా ప్రచారం చేశారు. సీమాంధ్రుల్లో రాష్ట్రం ఒకటిగా ఉండాలనే కోరిక ఉంటూనే తమ జీవితాన్ని తామే మెరుగుపరచుకోవాలనే భావన కూడా ఉంది. అందుకే ఎవరి పని వారు చేసుకున్నారు.
(2) నాయకుల రెచ్చగొట్టే మాటలను తెలంగాణా ప్రజలు బాగా విశ్వసించారు. ఎవరికైనా "తమ పేదరికానికి మరెవరో కారణం" అని చెప్పే మాటలు బాగా నచ్చుతాయి. గొప్పగా వర్ధిల్లుతున్న రుద్రాక్ష వ్యాపారాలు, మంత్ర తంత్రాలే దీనీకి ఉదాహరణ. కాబట్టి సహజంగానే తెలంగాణా ప్రజలు నాయకుల వలలో పడ్డారు. ఉద్యమాల్లో విరివిగా పాల్గొన్నారు. ఈ విషయం లో సీమాంధ్రవారిదీ కొంత పాత్ర ఉంది. కొంతమంది కేవలం తమ ఊరివాడికో తమ ప్రాంతం వాడికో అన్నీ దక్కేలా చూడటం, అందుకోసం కొన్నిసార్లు అవతలివారిని అణచివెయ్యటం కూడా జరుగుతుంది. ఇటువంటి భావజాలం అన్ని ప్రాంతాల ప్రజల్లోనూ కొద్దో గొప్పో ఉన్నా కొన్నిసార్లు సీమాంధ్రులు ఇలాంటి లక్షణాలని బహిరంగంగా ప్రదర్శించటం జరిగింది. ఒక్క వ్యక్తిపై వివక్ష చూపించినా అది వందమందికి ప్రసారం చేయబడే రోజులివి. అందుచేత కొద్దిమంది సీమాంధ్రులు చూపిన  విపరీతాభిమానం కూడా నేడు జాతికి శాపంగా పరిణమించాయి.
(3) సీమాంధ్ర పెట్టుబడిదారులు దోపిడీదారులు దొంగలు అంటూ KCR విరుచుకుపడ్డారు. ఆయన మాటలనే పరిగణనలోకి తీసుకుంటే సొంత ఊరిని వదిలి డబ్బంతా హైదరాబాదులో పెట్టినవారినేం అనాలి. ఇది అత్యాశ కాదా? నిజానికి నగరాల్లో పెద్ద పెద్ద ఆస్థులు ఉన్నవి (ఎక్కువగా) అప్పనంగా దోచుకున్న నాయకులకే. కాని దాని పాపం, నింద మోస్తోంది మాత్రం ఒక ప్రాంతానికి చెందిన సామాన్య ప్రజలు. ఎందుకిలా? ఓటుకు వందో వెయ్యో తీసుకున్న ఫలితమా? ఎన్ని తప్పులు చేసినా మనకులపువాడే కదా అని ఉపేక్షించిన గజ్జి గుణం ఫలితమా?

జరిగిపోయిన దాన్ని తలచుకుంటూ తలకాయో గుండెకాయో కొట్టుకోవటం వల్ల ఉపయోగం ఉండదు. జరిగేది ఏదైనా మన మంచికే అన్నారు పెద్దలు. ఇపుడు తెలంగాణేతర ప్రాంతాన్ని కూడా అభివృధ్ధిచేసుకునే అవకాశం ఉంది. దాని గురించి మరో టపాలో.


4 కామెంట్‌లు:

  1. correct. we deserve this for our foolishness. we are 120 crores. that stupid lady is ruling the country. who is she .bar attendant. how come? we are fools . she don't have that feel of sentiment..

    రిప్లయితొలగించండి
  2. I fully agree with the first comment. All over India, people are gradually realizing the true colours of Congress. But we Andhra people still in the primitive times. There is no political wisdom. Every body is after short time gains. Praise the foreigner, and earn her blessings. This was exactly done by the Indians in 17th & 18th centuries with Britishers. The result is 200 years of slavery. Even now we are in the slavery. Watch any congress leaders statements. In every sentence there is an enoromous praise of this Italian Goddess. We have not learned anything from history. Day by day our state is getting backward. we are still worshiping the Nehru family like GOD. There will be no bright future for the ignorant and short sighted people.

    రిప్లయితొలగించండి
  3. Actullay we should feel happy and jubilant. Finally we god rid of a headache. this should have been done long back in 1972. But unnecessarly unity was forced on us artificially. its never too late. we have intelligence, will, courage, enterprising nature. so we can develop our state. at least future generations will be happy. they will live with pride. Happy andhrapradesh for good riddance
    sreerama, chennai living here happily for more than a decade

    రిప్లయితొలగించండి